Trinethram News : మార్వాడీల దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22న తెలంగాణ బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ ప్రకటించింది. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ.. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన మార్వాడీలు తెలంగాణ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మార్వాడీ గో బ్యాక్ అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


