తేదీ : 19/08/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎమ్మిగనూరు – కర్నూలు ప్రధాన రహదారిలో వెళ్తున్నటువంటి ఓ ఆర్టీసీ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. డ్రైవర్ తిమ్మన్న వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. తక్షణమే ప్రయాణికులు అందరూ కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని పైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేయడం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


