13 New Pensions : మురమండ లో 13కొత్త పెన్షన్లు మంజూరు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మురమండ గ్రామపంచాయతీకు 13 కొత్త పెన్షన్లు మంజూరైనట్లు పంచాయతీ కార్యదర్శి రావిపాటి సత్యనారాయణ తెలిపారు.ఫించను పొందుతున్న భర్త చనిపోవడంతో ఇవి భార్య కు మంజూరైన పింఛన్లుగా పేర్కొన్నారు. కొత్తగా పెట్టుకున్న పెన్షన్లు ఇంకా మంజూరు కావాల్సి ఉందన్నారు. ఈ కొత్త 13 పెన్షన్లను మన కూటమి నాయకులు ఇంటింటికి వచ్చి పంపిణీ చేస్తారని మరియు సచివాలయ సిబ్బంది కలిపి ఇస్తారు అని తెలిపారు.

ఈ పించన్లు మన రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు ఏఎంసీ డైరెక్టర్ దేవళ్ళ రామ్మోహన్రావు (రాంబాబు), సొసైటీ చైర్మన్ వట్టికూటి జానకిరామయ్య(దత్తుడు), నీటి సంఘం ప్రెసిడెంట్ గన్ని రామారావు (పెద్దబాబి),కర్రవీరభద్రరావు, షేక్ మీరాభాయ్, బీజేపీ బొప్పన లోవ జనసేన నక్కరాజు తులూరి శేషుబాబు, తులూరి యేసు మరియు కార్యకర్తలు , తదితరులు కలిపి పింఛను దారులకు అమౌంట్ అందచేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

13 new pensions sanctioned

You cannot copy content of this page

Scroll to Top