మండపేట:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కపిలేశ్వరపురం మండలం, నేలటూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా జల్ జీవన్ మిషన్ (జేజేఎమ్) గ్రాంటు రూ.66.62 లక్షలతో నిర్మించిన 60 వేల లీటర్లు వాటర్ ట్యాంక్ (ఒ.హెచ్.ఎస్.ఆర్), 2500 మీటర్లు హెచ్.డి.పి.ఇ పైపు లైన్లు, 250 ట్యాప్ కనెక్షన్ లకు ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.4.50 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్లు ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


