MLA : సూక్మ సేద్యం పరికరాలు( పైపులు,స్ర్పింక్లర్స్) లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

దేవరకొండ జులై 17 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన మరియు పట్టు పరిశ్రముల శాఖ వారు ఏర్పాటు చేసిన సూక్మ సేద్యం పరికరాలు ( పైపులు,స్ర్పింక్లర్స్) పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, మంజూరు అయిన 18 మంది లబ్ధిదారులకు 18 సెట్లు సూక్మ సేద్యం పరికరాలు ( పైపులు,స్ర్పింక్లర్స్)లను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ప్రజా పాలనలో భాగంగా వ్యవసాయం,విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. రైతులు స్ప్రింక్లర్ ను సద్వినియోగం చేసుకొని, ఆర్ధికంగా ఎదగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA distributes micro-irrigation equipment

You cannot copy content of this page

Scroll to Top