తేదీ : 30/06/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, లో గత ప్రభుత్వం మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి రూపాయలు మూడు వేల కోట్లు ను పక్కదారి పట్టించిందని మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రైనిన్ల పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు, అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని, రూపాయలు పది లక్షలు కోట్లు అప్పు రాష్ట్రానికి మిగిల్చి వెళ్లిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు గాడిన పడుతున్నాయని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


