PV. Narasimha Rao Jayanti : ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో పీవీ. నరసింహారావు జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ప్రధాన చౌరస్తాలో ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా పీవీ. నరసింహారావు జయంతి వేడుకలు భారతరత్న,భారత మాజీ ప్రధాని రాజకీయ దురంధరుడు బహుభాష కోవిదుడు స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి వేడుకలు స్థానిక ప్రధాన చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశం రాజీవ్ గాంధీ మరణానంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైన సమయంలో ఈ దేశాన్ని ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడిన గొప్ప నాయకుడు ప్రధాని పదవికి వన్నెతెచ్చిన నాయకుడని అదేవిధంగా అచ్చ తెలుగు తేజం భారతదేశ కీర్తి నాయకుడని కొనియాడారు ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ్ మాట్లాడుతూ 1957 లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై భారత దేశ 9వ ప్రధానిగా ఎన్నికై కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప నాయకుడని కొనియాడారు వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాల్వలింగస్వామి బొంతల రాజేష్ ,మహంకాళి స్వామి, గట్ల రమేష్ ,ముస్తఫా ,బొమ్మక రాజేష్ ,నాయిని ఓదెల యాదవ్ , కొప్పుల శంకర్,యాకూబ్ ,దూళికట్ట సతీష్ ,నజీముద్దీన్ ,మాలెం మధు ,గుండేడి శంకర్ ,మేకల పోశం, గుంపుల తిరుపతి యాదవ్, యట్టం కృష్ణ, డేవిడ్, ఆడెపు రవి ,మిడిదొడ్డి ప్రవీణ్ ,రఘుపతి రెడ్డి, మనోజ్, రాజ్ కుమార్, రమేష్ గౌడ్ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PV. Narasimha Rao Jayanti Celebrations

You cannot copy content of this page

Scroll to Top