Trinethram News : అమరావతి :
ఏపీలో గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కు వచ్చే APK ఫైల్స్ ను క్లిక్ చేయవద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు. APK ఫైల్స్ను క్లిక్ చేయగానే.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల్లోంచి నగదు లూటీ అవుతుందని తెలిపారు.
శ్రీసత్యసాయి జిల్లాలో పీఎం కిసాన్ యోజన పేరుతో వచ్చిన APK ఫైల్ను ఓ రైతు క్లిక్ చేయగా.. ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.94,000 పోయాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసం జరిగితే 1930కి కాల్ చేయాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


