Trinethram News : AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో మంగళవారం CM రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రుల శాఖల మార్పులు, చేర్పుల విషయంపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఆయన ఆమోదంతో శాఖలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. దీనితో పాటుగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర వాటి గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


