త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ వారి ఆధ్వర్యములో మండపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు మంచి ఉద్యోగం సాధించడానికి ఈ జాబ్ మేళా ఉపయోగపడుతుందని, మీ నైపుణ్యం తో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో 11 కంపెనీలు పాల్గొనగా 206 మంది హాజరయ్యారు. వీరిలో 94 మంది ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం జరిగిందని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి హరిశేషు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పసలపూడి శ్రీనివాసరావు, రాయుడు గంగరాజు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా॥టి.కె.వి.శ్రీనివాసరావు, ఎ.పి.ఎస్.ఎస్.డి.సి స్టాఫ్, సీడప్ స్టాఫ్ మరియు కళాశాల స్టాఫ్ పాల్గొన్నరు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


