ప్రముఖ న్యూస్ ఛానెల్ లో ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం పై ఫైర్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోవర్ధన్ పై అసత్యపు ప్రచారం చేయడం సిగ్గుచేటని వెల్లడి
Trinethram News : హైదరాబాద్ ; జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) నిన్న(గురువారం) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఏఐజీ హాస్పిటల్కి ఆయనను కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్కి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు .
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని బీఆర్ఎస్ హరీష్ రావు తెలిపారు. బయట జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని అన్నారు. 48 గంటల పాటు మాగంటి గోపీనాథ్ని వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారని చెప్పారు. ఇటీవల బీఆర్ఎస్ నేత సర్దార్ మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


