త్రినేత్రం న్యూస్ 23.05.2025. అశ్వారావుపేట నియోజకవర్గ, శాసనసభ సభ్యులు జారే ఆదినారాయణ స్వగ్రామ మైన గండుగులపల్లి గ్రామ, పంచాయతీ లో ఇందిరమ్మ గృహాలకు అర్హత, పొందిన. లబ్ధిదారుల కు హక్కు పత్రాలను ఈ రోజు గండుగులపల్లి క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాట్లాడుతూ ముఖ్యమంత్రి ,రేవంత్ రెడ్డి, నాయకత్వంలోని, రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు గృహ హక్కుల కోసం, కృషి చేస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబం తలదాచుకునే ఇంటిని కలిగి ఉండాలనే లక్ష్యంతో, ఇందిరమ్మ గృహాల అమలను వేగంగా అమలు చేస్తోందన్నారు
ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.వో రవీందర్ రెడ్డి, ఎం.పీ.ఓ రామారావు , స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


