కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11 : సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే 199 వ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి లోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో గల రిక్షా పుల్లర్స్ కాలనీలో మహనీయునికి పూలమాలవేసి నివాళులు అర్పించిన డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు.ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట నిలిచారని విద్య యొక్క విశ్వీ కరణను సమర్థించిన మొదటి సంస్కర్త, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారని, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారని ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు, లాగ్రేంజ్లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారని. అతను అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు అని తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమానికి డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, సతీష్ రావు, గిరిబాబు, ఆంజనేయులు, బాబు, సత్యనారాయణ, సోమయ్య, రాoచందర్, రామ్మూర్తి, వెంకట్ రెడ్డి, శ్రీనివాసరావు,జగదీష్ గౌడ్, యశ్వంత్, అఖిల్, మల్లేష్,సంతోష్, వాసు, హరీష్, ప్రవీణ్, రవి,సాయి, కిరణ్, సానప్ప, రాజు, వినయ్, హరీష్, రవి, రాధిక, రాధా, మాధవి రెడ్డి, అవనిత, శైలజ, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


