![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-18.43.29.jpeg)
నగరంలోని పార్కులు థీమ్స్ పార్క్ లు అభివృద్ధి చేయాలి
పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం నగరం పర్యటన ఆకర్షణ లో పార్కులు కీలకం కావాలి
పిల్లలకి విజ్ఞానం ఆనందం కలిగించే విధంగా పార్కుల అభివృద్ధి చేపట్టాలి
కడియం నర్సరీ ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి పై సమీక్ష
Trinethram News : రాజమహేంద్రవరం , తేదీ : 5.2.2025. జిల్లా కలెక్టర్ ప్రశాంతి నగరంలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్ లతో కూడి నగరవాసులను, పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆమేరకు పనులు పూర్తి చెయ్యాలని తెలిపారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సెవెన్ హిల్స్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో నగరంలోని 26 పార్క్స్ లు , నగరవనం అభివృద్ధి పై ప్రతిపాదించిన ముసాయిదా పిపిటి ని మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ తో కలిసి కలెక్టర్ ప్రతిపాదిత ప్రాజెక్ట్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, నగరంలోని 26 పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు. ఇప్పటికే నగరంలో కంబాల చెరువు పార్కు, దానవాయి పేట, ప్రకాశ్ నగర్, జేఎన్ రోడ్డు, ఏవీ అప్పారావు రోడ్డు, వంటి ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేశామని, వాటికి మరింత విలువ ఆధారితమైన విధానంలో పార్కుల అభివృద్ధి చెయ్యాల్సి ఉందన్నారు. కేవలం పార్కులు విశ్రాంతి కో, పిల్లల ఆటలకో పరిమితం కాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇందులో భాగంగా ప్రాంతాల వారీగా థీమ్ పార్కులు ఆటలకు, జిమ్, యోగా , డ్యాన్స్ , మెడికేటెడ్ ప్లాంట్స్ , మ్యూజిక్, డ్యాన్స్, రాక్ గార్డెన్, శారీరక వ్యాయామం, స్పోర్ట్స్, వాటర్ షో , అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లవర్, బర్డ్, వ్యర్థాల నుంచి విభిన్న ఆకృతుల కలయిక, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా వినూత్న డిజైన్లు రూపొందించడం ద్వారా వివిధ రకాల ప్రతిపాదనలతో పార్కుల ఏర్పాటు చేయలన్నారు. పిల్లలకి ఆహ్లాదం కలిగించేలా పార్కులు ఉండేలా చూడాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. పెద్ద వారి నుంచి చిన్నారుల వరకు అన్ని వర్గాల వారికి ఆసక్తి, పార్కులకి రావాలనే ప్రేరణ కలుగ చేయాలన్నారు. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి వాటి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పర్యాటక, హార్టికల్చర్, రెవిన్యూ, పంచాయతీ రాజ్ అధికారులతో కడియం నర్సరీ ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే కడియం ప్రాంతాన్ని పర్యటక పరంగా ఆకట్టుకునే రీతిలో అభివృద్ది ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంతో కడియం నర్సరీలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేలా నర్సరీ ప్రతినిధులతో సంప్రదించడం, కార్యరూపం దాల్చడం జరిగిందన్నారు.
కడియం నర్సరీలను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా వివిధ రకాల అంశలతో కూడిన బోటింగ్, స్టాల్ల్స్, జిప్ లాగ్, అడ్వంచర్ స్పోర్ట్స్ తదితర అంశాల సమ్మేళనంగా రూపొందించిన రూట్ మ్యాపింగ్ పై సూచనలు చేశారు. ఉపాథి స్టాల్ల్స్, బోటింగ్ ప్రతిపాదన కోసం లే అవుట్ పై అధికారులు వివరించడం జరిగింది. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ పాత్ లు పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నగరవనం అభివృద్ధి పై వినూత్న ఆలోచనలతో ముందుకు రావలసి ఉందని మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ పేర్కొన్నారు. ఇకో ఫ్రెండ్లీగా అభివృద్ధి చెయ్యడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రణాళిక తయారు చేసిన పిపిటి ని పరిశీలించారు.
ఈకో ఫ్రెండ్లీ విధానంలో ప్రకృతి వనరుల పరిరక్షణ మరియు పార్కులలో పచ్చదనం పెంచడానికి, సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి, వాటి ద్వారా అక్కడి లైటింగ్ సిస్టమ్ పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందని సెవెన్ హిల్స్ అసోసియేట్ ప్రతినిధులువివరించారు.
ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ , అదనపు కమిషనర్ శైలజ వల్లి, ఆర్ఎంసి అధికారి అబుల్ మాలిక్, సెవెన్ హిల్స్ అసోసియేట్ ప్రతినిధులు , అనంతరం ఏపీఏమ్ఐపి పిడి ఏ దుర్గేష్, జిల్లా పర్యటక అధికారి పి. వెంకటాచలం , ఎంపిడివో కే. రమేష్ , కడియం డిప్యూటీ తహసిల్దార్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సమాచార పౌర సంబం ధాల అధికారి, రాజమహేంద్ర వరం వారిచే జారీ.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![theme parks](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-18.43.29-909x1024.jpeg)