TRINETHRAM NEWS

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో అప్పులబాధ తట్టుకోలేక ఓ రైతు పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం జరిగింది. వేసిన పంటలు చేతికి రాక చేసిన అప్పులు పెరిగి వారి నుండి ఒత్తిడి ఉండటంతో కటికి రమణయ్య అనే రైతు పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.