WhatsApp Image 2023 12 29 at 1.12.50 PM
అంబటిని ఈసారి ఓడించి తీరుతాం
AP: సత్తెనపల్లి నియోజకవర్గ అసమ్మతి వైసీపీ నేతలు మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబు వద్దు.. జగనన్నే ముద్దు అంటూ తాడేపల్లి ఎంపీ విజయ్ సాయి రెడ్డి నివాసం ముందు ఆందోళన చేపట్టారు. మంత్రి అంబటి ప్రతి గ్రామంలో వైసీపీలోనే రెండు ముఠాలు ఏర్పాటు చేసి కక్షలకు కారణమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుకు ఈసారి సీట్ ఇస్తే ఓడించి తీరుతామని స్పష్టం చేశారు.
