ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 06 at 11.09.02

TRINETHRAM NEWS

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పై వెలిసిన శ్రీమల్లికార్జున స్వామి భ్రమరాంభిక, కేతమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన జరుగనున్న శ్రీమల్లికార్జున స్వామి భ్రమరాంభిక కళ్యాణ మహోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జేకే శేఖర్ యాదవ్, సింహ యాదవ్, సమ్మయ్య యాదవ్, రేణుక యాదవ్, ఆంజనేయులు యాదవ్, కుమార్, ఎల్లేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page