TRINETHRAM NEWS

ఇండిగో విమానయాన సంస్థకు అరుదైన ఘనత

విమానయాన సంస్థ ఇండిగో అరుదైన రికార్డు సాధించింది. ఒకే ఏదాది లో 10 కోట్ల మంది ప్రయాణికులును గమ్య స్థానాలకు చేర్చిన తొలి దేశీయ విమానయాన సంస్థ గా నిలిచింది.

ఈ ఏడాది తో 17 వసంతాలు పూర్తి చేసుకొన్న ఇండిగో సంస్థ అనతి కాలంలోనే ఈ ఘనత సాధించింది. దీనితో ట్రాఫిక్ పరంగా టాప్ -10 ఎయిర్లైన్స్ సంస్థల జాబితాలో నిలిచినట్లు ఇండిగో సంస్థ తెలిపింది.

ఈ ఇండిగో సంస్థ అంతకుముందు ఒకే క్యాలెండర్ ఇయర్లో 7.8 కోట్ల మందిని గమ్య స్థానాలకు తమ ఇండిగో విమానాల ద్వారా చేర్చినట్లు వెల్లడించారు.