బిసిలు బ్యాక్ బోన్ అంటూనే వెన్నువిరుస్తావా సైకో జగన్?!

TRINETHRAM NEWS

బిసిలు బ్యాక్ బోన్ అంటూనే వెన్నువిరుస్తావా సైకో జగన్?!

ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకోఇజానికి బలైన ఓ బిసి నాయకుడి భవనం. గ్రేటర్ విశాఖ గాజువాక సెంటర్లో అన్ని అనుమతులు, నిబంధనల మేరకే టిడిపి సీనియర్ నేత, బిసినాయకుడు పల్లా శ్రీనివాసరావు తమ సొంతస్థలంలో భవనాన్ని నిర్మించుకున్నారు. శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడని కక్షగట్టిన సైకో జగన్… 2020లో కుంటిసాకులతో ఆయన నిర్మించుకున్న భవనాన్ని కూల్చివేశారు. బిసిలు బ్యాక్ బోన్ అంటూ వేదికపై లెక్చర్లు ఇస్తున్న జగన్… నాలుగున్నరేళ్ల పాలనలో అడుగడుగునా బిసిలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. బిసిల ఆస్తులను ధ్వంసం చేయడమేగాక రాష్ట్రవ్యాప్తంగా 26వేలమంది బిసిలపై తప్పుడు కేసులు బనాయించారు. ఎంతోమంది అమాయక బిసి సోదరులను పొట్టనబెట్టుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బిసిల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్… వారిపైనే ఉక్కుపాదం మోపుతూ రాక్షసానందం పొందుతున్నాడు. నియంతపాలనకు సాక్షీభూతంగా నిలుస్తున్న ఈ శిథిలాలతోనే బిసిలంతా కలసి నీ అరాచక ప్రభుత్వానికి పాడెకట్టడం ఖాయం…రాసిపెట్టుకో జగన్మోహన్ రెడ్డీ!!
….నారా లోకేష్,
(యువగళం పాదయాత్ర నుండి.)

You cannot copy content of this page

Scroll to Top