TRINETHRAM NEWS

గ్లోరీ టూ జీసస్ మినిస్ట్రీస్ ను సందర్శించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద…

ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ వివేకానంద నగర్ లో గల గ్లోరీ టు జీసస్ మినిస్ట్రీస్ చర్చిను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద సందర్శించి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ నిన్ను మనసుతో ఆశీర్వదించి బంపర్ మెజారిటీని అందించారన్నారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రజల సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో గ్లోరీ టూ జీసస్ మినిస్ట్రీస్ చర్చి పాస్టర్ పసల ఆంటోనీ, సంఘ పెద్దలు మడుపు శ్యాంసుందర్, మడుపు ప్రశాంతి, పసల జోసెఫ్, డేవిడ్, యోనా, కుమార్, జోసెఫ్, చందు, తదితరులు పాల్గొన్నారు.