
Rama Naidu : పశ్చిమగోదావరి జిల్లా: త్రినేత్రం న్యూస్: ఆగస్టు 12; పాలకొల్లు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపేందుకు వెనకాడొద్దని స్పష్టం చేశారు. పుష్కర ఎత్తిపోతలపై మంత్రి సమీక్షించారు. పనులు జరగకపోవడంపై ఆ కాంట్రాక్టర్లపై అగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరకు పోలవరం నీటిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయాల్సి ఉన్నందున పనులు త్వరగా పూర్తిచేయాలని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe