
Jagan : త్రినేత్రం న్యూస్ : పొగాకు ఎగుమతిదారులు ఎక్స్పోర్ట్ ఆర్డర్లు లేవంటూ రైతులను మోసం చేస్తున్నారని, ఆర్డర్లు లేకుండానే 142 మిలియన్ కిలోలకు ఇండెంట్ ఎలా ఇచ్చారని పొగాకు బోర్డే అంగీకరించిందని పొగాకు రైతు మారెళ్ల బంగారుబాబు అన్నారు. కనీసం ఆ ఆర్డర్ల మేరకైనా మద్దతు ధర ఇవ్వాలని కోరారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సిండికేట్కు కొమ్ములు వచ్చాయని, ఒక్క పొగాకు రైతులే కాదు రాష్ట్రంలోని అనేక వర్గాలు ఆ సిండికేట్ వల్ల ఇబ్బందులు పడుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు.
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతుల ప్రయోజనాలను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe