జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి

TRINETHRAM NEWS

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కకడే 12 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు..

జార్ఖండ్‌లోని జంతారా దగ్గర బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

You cannot copy content of this page

Scroll to Top