తేదీ : 31/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం సమీపంలో ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గం లో ఏఐటీయూసీ నూట ఆరు వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను సంబంధిత అనుబంధ కార్మిక సంఘాలు జెండాలను ఆవిష్కరించారు.
తీన్మార్ డప్పులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో ఏఐటీయూసీ పాత్రను కార్మిక హక్కులు, చట్టాల సాధన కోసం చేసినటువంటి పోరాటాలను న్యాయవాది, కార్యదర్శి నెక్కంటి. క్రాంతి కుమార్ కొనియాడారు. కొబ్బరికాయలు కొట్టి ఆ సంఘం జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆరేటి. మృత్యుంజయరావు, సాన బోయిన. పణి రాజు, దొంగ. పూర్ణచంద్రరావు, జక్కం చెట్టి. రామకృష్ణ, ప్రసాద్, అమరావతి సీనియర్ నాయకులు నెక్కంటి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


