
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. అశ్వారావుపేట MLA జారే ఆదినారాయణ ఆహ్వానం మేరకు గండుగులపల్లి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ యువజన అధ్యక్షులు గుంపుల రవితేజ, మరియు అన్నపురెడ్డి పల్లి మండల యువజన అద్యక్షులు వేముల నరేష్, చంద్రుగొండ మండల యువజన అధ్యక్షులు మహేష్, ములకలపల్లి మండల యువజన అద్యక్షులు కొడిమే వంశి పాల్గొని నియోజకవర్గ మరియు మండలల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు గురించి ఎంఎల్ఏ జారే ఆదినారాయణ వారితో చర్చించి రాబోయే రోజులలో యూత్ ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వం నుండి వస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో యువజన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
