TRINETHRAM NEWS

అమరావతి

ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్

విజయసాయి రెడ్డి కామెంట్స్

ఈసీ కి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించాము.

జనసేనకి గుర్తింపు లేకపోయినా ఎందుకు ఆహ్వానించారాని ఆడిగాం.

పొత్తు లో భాగంగా టీడీపీ అడిగిందని చెప్పారు

గ్లాస్ గుర్తు సాధారణ గుర్తు….సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాలలో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధం

కోనేరు సురేష్ అనే వ్యక్తి సీఈఓ కి కంప్లైంట్ ఇచ్చారు. ఇతను టీడీపీ లో కీలకంగా వ్యవహారిస్తున్నాడు

కర్నూల్ జిల్లా లో 67370 బోగస్ ఓట్లు ఉన్నాయని సురేష్ కంప్లైంట్ ఇచ్చాడు.

కానీ అక్కడ వెరిఫికేషన్ చేసాక 87శాతం నిజమైన ఓట్లు ఉన్నాయని గుర్తించారు.

ఈసీ వెరిఫికేషన్ అనంతరం చాలా వరకు సరైన ఓటర్లు ఉన్నారని గుర్తించారు

తప్పు దోవ పట్టించినవారిపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు ఇచ్చాము

రెడ్ బుక్ పేరు తో అధికారులపై లోకేష్ చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి.

ఏపీ కి తెలంగాణ కు ఒకేసారి ఎన్నికలు పెట్టాలని కోరాం