తేదీ : 25/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మండలం, మెట్ట ఉప్పరగూడెంలో క్వారీ చెరువులో పడి సైదు. గంగ (52) మృతి చెందినట్లు రూరల్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. గేదెలను మేపటానికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుమారుడు తేజ మరియు తన స్నేహితుడు కలిసి ఆమెను వెతకడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ఆ చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు తేజ రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


