WhatsApp Image 2024 12 16 at 21.25.26
రేవంత్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు.. కవిత సూటి ప్రశ్న
Trinethram News : హైదరాబాద్ : జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసనమండలిలో ఈరోజు(సోమవారం) కవిత మాట్లాడారు.రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలని చెప్పారు. సెరికల్చర్ విభాగంలో దాదాపు 650 ఉద్యోగాలు ఉంటే… 400మంది ఇటీవల రిటైర్ అయ్యారని చెప్పారు.
వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలని చెప్పారు. చేనేత కార్మికులకు బెంగళూరు నుంచి పట్టును దిగుమతి చేసుకోవడం వల్ల అదనపు భారం పడుతుందని అన్నారు. పట్టుగూళ్ల విషయంలో చేనేత కార్మికులకు బాకీ ఉన్న రూ.8కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అన్నారు. ఆ హామీ అమలు ఎంతవరకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని కవిత నిలదీశారు.
బీసీ గురుకుల పాఠశాలలపై చిన్న చూపు…
‘‘కేసీఆర్ హయాంలో సగటున ఏడాదికి 27 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఏర్పాటు చ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
