Sirisilla Rajaiah : సిరిసిల్ల రాజయ్యకు ఘనంగా స్వాగతం

TRINETHRAM NEWS

తేదీ : 16/01/ 2025.
సిరిసిల్ల రాజయ్యకు ఘనంగా స్వాగతం.

ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్ ) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కు నేలటూరి అన్నదమ్ములు పార్టీ సీనియర్ నాయకులు, వెంకట అప్పారావు,Ex ఉప సర్పంచ్ మోహన్ ఘనంగా స్వాగతం పలికారు.
సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా ఆయన రావడం జరిగింది. ప్రజలందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు ఆలస్యంగా తెలిపినందుకు ధన్యవాదాలు అని అనడం జరిగింది. ప్రతి ఒక్కరి కుటుంబంలో సిరిసంపదలు , సంతోషం కలిగి, ఎవరికి ఎటువంటి కష్టనష్టాలు రాకుండా, అనారోగ్యం లేకుండా ఆరోగ్యం గా ఉండటానికి ప్రయత్నించాలని, అన్నారు.
వచ్చిన బంధువులకు , అతిధులకు లోటుపాట్లు రాకుండా చూసుకున్నారు. కనుమ పండుగ సందర్భంగా మరిచిపోలేని రీతిలో ఇందు భోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ పండుగ సందర్భంలో నేలటూరి. పార్థసారథి దంపతులు శ్రీమతి చిట్టెమ్మ. మరియు లక్ష్మి, నిర్మల , సుమ శ్రీ, శ్రావణి, ఉపేంద్ర, సాగర్, రాజు, నవత, వివేక్ , బట్టు..రాకి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top