WhatsApp Image 2025 01 25 at 13.43.17
ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తాం
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం
కంభం : కులం,మతం, జాతి, వర్గం, భాష తదితర ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తామంటూ ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో మాల్యాద్రి అధ్యక్షతన మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఓటరు ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్బంగా ఎంఈవో మాల్యాద్రి ప్రజాస్వామ్య విలువలను, ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
