
Water Crisis : దేవరకొండ డివిజన్ మార్చ్ 29, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలో మిషన్ భగీరథ పథకంలో సాంకేతిక సమస్యల కారణంగా తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నాంపల్లి మండలం బట్లపల్లి వద్ద ఉన్న నీటి శుద్ధి కేంద్రంలో ప్రధాన మోటర్లు చెడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో దేవరకొండ నియోజకవర్గం లో చింతపల్లి , డిండి , కొండమల్లేపల్లి చందంపేట నేరేడు గుమ్మ లాల పరిధిలోని 320 గ్రామాలకు తాగునీటి సరఫరా ఆగిపోయింది. ఈ మరమ్మత్తులు పూర్తి కావడానికి ఏప్రిల్ 15 వరకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

