WhatsApp Image 2024 09 27 at 16.38.17
Wages should be increased for supporting staff working in urban primary health center in Telangana state
జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు
హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
*రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న ముగ్గురు సపోర్టింగ్ స్టాఫ్ లు ఉన్నారు. ఒకరు ఎం.ఎన్.ఒ., ఒకరు వాచ్ మెన్ ,ఒకరు స్వీపర్ ఉన్నారు. సపోర్టింగ్ స్టాఫ్ నుండి పేరును వేరు చేయాలి కొందరు ఏస్.ఏస్.సి. విద్యార్హత పొందిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి డీసిగ్నేషన్ మెడికల్ అసిస్టెంట్ (లేదా) ఏం.ఎన్.ఓ.గా ముగ్గురిలో ఒకరిని పేరు మార్చాలి, రాష్ట్ర వ్యాప్తంగా 824 మంది ఉన్నారని, ప్రస్తుతం వారి జీతం నెలకు రూ. 10000/- మాత్రమే ఉందన్నారు. పెరిగిన ఖర్చులతో, చాలీచాలని జీతాలతో జీవితాలు నెట్టుకురాలేక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం లో సపోర్టింగ్ స్టాఫ్ కు 15600/- ఎం.ఎన్.ఓ.కు బేసిక్ వేతనం రూ.19500 జీతం ఇవ్వాలని రామ రాజేష్ ఖన్నా కాంగ్రెస్ ప్రభుత్వానీ విజ్ఞప్తి కోరారు.జీతాలు పెంచేందుకు అందరూ కలిసి ఉద్యమించాలని రాష్ట్రంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగులందరికీ పిలుపునిచ్చారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
