
Vikram-1 : హైదరాబాద్:జులై 18 : దేశంలోని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేట్ సంస్థ రూ పొందించిన రాకెట్ విక్రమ్-1శనివారం కొంత ఆలస్యంగా నింగిలోకి దూసుకెళ్లిం ది ఈ ప్రయోగంలో భాగంగా మిషిన్ ఆగమన్ విక్రమ్1 సృష్టికర్తల సంతకాలు స్పేస్ లోకి పంపారు. భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి సాధిం చింది.
శ్రీహరికోట వేదికగా చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 12:05 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిం ది. తొలత షెడ్యూల్ చేసిన సమయానికి సాంకేతిక సమస్య ఏర్పడడంతో 12.05 నిమిషాలకు రాకెట్ ను నింగిలోకి పంపిం చారు శాస్త్రవేత్తలు.
అయితే రాకెట్ లాంచ్కు అన్ని సిద్ధం చేసిన తర్వాత ఆఖరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తొలుత రాకెట్ ప్రయోగాన్ని నిలిపి వేసినట్టు శాస్త్రవేస్త లు తెలిపారు. ముందుగా నిర్ణయిం చిన షెడ్యూల్ ప్రకా రం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా..
లాంచ్ ప్యాడ్ నుండి రాకెట్ బయలుదేరే కొద్ది నిమిషాల ముందు సిస్టమ్స్లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు శాస్త్రవేత్త లు. దీంతో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్ర యోగాన్ని తాత్కాలి కంగా ఆపేశారు.
అయితే ఆఖరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు కారణం ఏంటనే విషయాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రవే త్తల బృందం దాన్ని సరిచేసి మళ్లీ కౌంట్ డౌన్ను స్టార్ట్ చేశారు.
మధ్యాహ్నం 12:05 నిమిషాలకు రాకెట్ ప్రయోగాన్ని చేపట్ట నున్నట్టు స్పష్టం చేశారు. సాంకేతిక సమస్య కారణంగా రాకెట్ ప్రయోగాన్ని 35 నిమిషాల ఆల స్యం చేసినట్టు శాస్త్ర వేత్తలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe