WhatsApp Image 2024 01 13 at 1.40.44 PM
తాడేపల్లి
వేమారెడ్డిని కలిసిన విజయసాయిరెడ్డి
మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో శనివారం వైసిపి ఏంటీఎంసీ అధ్యక్షులు దొంతి రెడ్డి వేమారెడ్డిని రాజ్యసభ సభ్యులు
విజయ్ సాయిరెడ్డి మంగళగిరి వైసీపీ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.దుగ్గిరాలకు సంబంధించిన
పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని వైసిపి విజయానికి కృషి చేయాలని
అన్నారు. కలిసికట్టుగా ముందుకు వెళితే మంగళగిరి నియోజకవర్గంలో
గెలుపు తధ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, పేర్లపూడి సర్పంచ్ గంగాధర్ రావు,షేక్ బాషా,పిల్లి రాఘవులు, శైలజ, రజనీకాంత్,లోకేష్,ఆళ్ల మహేష్, వైసీపీ నాయకులు మేకా అంజిరెడ్డి, యూ.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
