TRINETHRAM NEWS

గద్వాల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు

గద్వాలపట్టణం జనవరి:-గద్వాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్నా తహసీల్దార్ బి. నరేందర్ ఇటీక్యాల కు బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా కార్యాలయ సిబ్బంది ఇద్దరు తహసీల్దార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజోలి తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ, డిటిలు ఝాన్సీ రాణి, విజయాకుమార్, అధికారి మృదుల వర్షిణి, ఆర్ఐ లు వెంకటేశ్వర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, నాగేంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.