WhatsApp Image 2024 01 06 at 6.56.52 PM
Trinethran News : Telangana
మాది ఫ్రెండ్లీ విధానం: రేవంత్ రెడ్డి
పరిశ్రమల ప్రోత్సాహం విషయంలో తాము ఫ్రెండ్లీ విధానాన్నే అవలంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు. 2025 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలని ఆకాంక్షించారు. కొత్తగా ఫార్మా విలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడతామని చెప్పారు. ప్రభుత్వం నుంచి అన్ని పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.
