WhatsApp Image 2024 01 24 at 10.23.07 AM
వైరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం..
మధిర,జనవరి24:-
ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో మధిర శివాలయం దగ్గరలో గల వైరా నది నీటిలో గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఇతను సుమారు 50 ఏళ్ల వయసు కలిగి ఉంటాడని . తెల్లనీ చెక్స్ తో ఉన్న చొక్కా ధరించి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న మదిర పట్టణ ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.మృతుడు మడుపల్లి ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతునికి సంబంధించిన సమాచారం తెలిసినవారు వివరాలు పోలీసులకు తెలుపాలని ఎస్సై కోరారు.
