అరకులోయ మండలం పద్మ పురం,లో పీసా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

TRINETHRAM NEWS

అరకులోయ మండలం పద్మ పురం,లో పీసా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

అరకులోయ! జనవరి 4.త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్!

అరకువేలి మండలం. పద్మాపురం గ్రామపంచాయతీ .
ఎండపల్లివలస రెవెన్యూ గ్రామంలో. సర్పంచ్ సుస్మిత , ఎలక్షన్ ఆఫీసర్,సి.హెచ్ వేంకట రమణ అధ్యక్షతన
జరిగిన పీసా కమిటీ ఎన్నికల్లో పద్మపురం పీసా ఉపఅధ్యక్షుడు, కొండబాబు, కార్యదర్షి గా గోపిను, ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఎండపల్లి వలస గ్రామసభ. రెండవసారి కూడా{గతంలో కార్యదర్శి} పీసా కమిటీ ఉపాధ్యక్షులుగా మహేష్ కార్యదర్శిగా సీతారాం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు. ఎలక్షన్ ఆఫీసర్ వెంకట రమణ ఎన్నికైన వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఎండపల్లి వలస ఉప అధ్యక్షులు మహేష్ మాట్లాడుతు ఎండ పల్లి వలస పంచాయతి పరిధి లో ఏటువంటి సమస్య ఉన్న అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కార దిశగా కృషి చెస్తాను అని అన్నారు.ఈ కార్య క్రమంలో వార్డు మెంబర్లు, వైస్ సర్పంచ్ భగత్ రాము మరియూ సూపర్ వార్డ్ నెంబర్లు ఆది, జగత్ రాయి, వార్డ్ నెంబర్ గోపాలు, రవి, అఖిలపక్షం నాయకులు, యువ నాయకులూ వార్డ్ నెంబర్ పొట్టంగి సింహాద్రి, చిన్ని.గ్రామస్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top