టీఎస్ పీఎస్సీ చైర్మన్ గామాజీ డిజిపి

TRINETHRAM NEWS

టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా
మాజీ డిజిపి❓️

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టీఎస్‌పీఎస్సీ, ఛైర్మన్‌ నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఈ పదవిలో నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలిం చినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశం ఉందంటున్నారు.

ప్రభుత్వం ఇప్పటికే ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్‌ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్‌, కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ సోమవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది.

ఛైర్మన్‌ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ రిటైర్డ్ అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్‌ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించి నట్లు సమాచారం.

You cannot copy content of this page

Scroll to Top