సర్క్యూట్ టూరిజం బస్సులను ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం, ఫిబ్రవరి 29 : రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు వివిధ చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పేర్కొన్నారు.

నోవాటెల్ ఎదురుగా నున్న బీచ్ రోడ్డులో పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన 12 సర్క్యూట్ టూరిజం బస్సులను పర్యాటక శాఖ మంత్రి గురువారం ఉదయం రిబ్బన్ కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించారు.విజయవాడలో మరో 6 బస్సులను దేవాదాయ శాఖ మంత్రి ప్రారంభించినట్లు చెప్పారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధిసంస్థ యాత్రికులకు వారి ప్యాకేజీ టూర్లు మరియు సర్క్యూట్లు, హోటళ్లు మరియు దర్శన సదుపాయం ద్వారా యాత్రికులకు అత్యంత సంతృప్తికరంగా సౌకర్యాలను అందిస్తోందని అన్నారు.. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, రాష్ట్రంలోని చాలా ముఖ్యమైన / చారిత్రాత్మక దేవాలయాలను అనుసంధానం చేయడం ద్వారా, వారి పవిత్ర, విశ్వాస మరియు ఆధ్యాత్మిక పర్యాటక సేవలను మరియు నాణ్యమైన పర్యాటక సేవలను మెరుగుపరచాలని

You cannot copy content of this page

Scroll to Top