జాతీయ జెండాను పార్టీ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు నిర్వహించాలి.
బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ మే 01 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా వ్యాప్తంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక కలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు కుమార్ పిలుపునిచ్చారు.
దేవరకొండలో స్థానికంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లు అలుపెరుగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు నియోజకవర్గ కేంద్రాలతో మున్సిపాలిటీలో పట్టణాలు మండల కేంద్రాలలో జాతీయ జెండాను పార్టీ పతాకాలు ఎగురవేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు పార్టీ నాయకులు, శ్రేణులు ప్రజలతో కలిసి అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు.
కుమారుల త్యాగాలు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు సబండవర్గాల సమిష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సహకారం అంది నాయన గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తొలి ప్రస్థానం యవదేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సర్కార్ కు కూడా దిక్సూచిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతుబంధు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పథకాలు దేశానికి దిక్సూచిలా(దీప స్తంభంవలె) మారాయని, ఇది ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని, ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


