WhatsApp Image 2024 06 29 at 14.04.04
Ramagundam MLA said the services of sanitation workers are invaluable and their dedication towards cleanliness of the environment is visible
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ లోని ప్రధాన చౌరస్తా కూడలి వద్ద పారిశుద్ధ కార్మికులను కలిసి మాన్య రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ మాటామంతి జరిపినారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులతో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ
ప్రొద్దున ఉదయం 3 గంటల నుండి పారిశుద్ధ పనులు నిర్వహించే మీరు పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మీరు చేసే సేవలు అమూల్యమైనవని పరిసరాల పరిశుభ్రత లో మీ యొక్క అంకిత భావం కనబడుతున్నదని తప్పకుండా పారిశుద్ధ కార్మికులకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారితో కలిసి టీ సేవిస్తూ వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ
ఈ సందర్భంగా మాట్లాడడం జరిగినది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
