జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 11 at 20.57.13

TRINETHRAM NEWS

ఎన్నో ఏళ్ళ సీపీఎం పోరాట ఫలితంగా దక్కిన ప్రతిఫలం చిడివలాస రహదారి నిర్మాణం!

అల్లూరి జిల్లా అరకులోయ: జనవరి 12.త్రినేత్రం న్యూస్.

గన్నెల పంచాయితీ చిడివలస”గ్రామంలో సిపిఎం (గిరిజనసంఘం) పాదయాత్ర పోరాట ఫలితంగా తారు రోడ్డు నిర్మాణం తో గిరిజనుల్లో సంతోషం.
గన్నెల జంక్షన్ నుండి సుమారు రెండు గ్రామాలకు ( 6కి.మి సబక, కింటిబడి,ఈ రెండు గ్రామాలకు తారు రోడ్డు నిర్మాణం పూర్తి) ఆనుకొన్ని ఉన్న చిడివలస గ్రామం 6 కి.మి సుమారుగా 40 కుటుంబాలు ప్రజలు నివశిస్తున్నారు. సభక జంక్షన్ నుండి చిడీవలస గ్రామం వరకు సుమారు 1కి.మీ వరకు ఉంటుంది, ఈ మూడు గ్రామాల ప్రజల తరఫున గతంలో ఎన్నో సార్లు (సీపీఎం) గిరిజన సంఘం ఆధ్వర్యంలో అధికారులకు, రాజకీయ నాయకులకు చాలా సార్లు రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రాలు,పోరాటలు పాదయాత్రలు చేస్తే ఈ యొక్క మూడు గ్రామాలకు ప్రభుత్వం రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది ఆని, అరకు లోయ గిరిజన సంఘం నాయకుడు ఓలేక అప్పలస్వామి మాట్లాడుతు స్వాతంత్ర్యం వచ్చి సుమారుగా 76 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి కూడా గిరిజన ప్రాంతంలో సరైనా విద్యా, వైద్య, రోడ్డు,

మంచి నీటి సౌకర్యాలు లేని గ్రామాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతున్న గిరిజన ప్రాంతాల జీవితాలు, మారట్లేదు, దీనికి కారణం గిరిజన ప్రజలకు నమ్మించి భ్రమ లో ముంచి ప్రజల సొమ్ముతో ప్రజల ఓట్లతో గెలుస్తున్న నాయకులు, వాల స్వార్ధానీకి వాడుకుంటున్నారు తప్ప ప్రజ సమస్యలు పట్టించుకోవడం లేధు.అయిన సరే అలాంటి నాయకులకు వత్తాసు పలకకుండా గిరిజన సంఘం తొ కలసి వచ్చి పోరాటాలు చేసినా యావత్ గ్రామ పంచాయితి నాయకులకు, ప్రజలకు, పార్టీలకు అతీతంగా అందరూ కలసి వచ్చి మా పాదయాత్ర కు సంపూర్ణ మద్దతు ద్వార మనం సాధించుకున్న విజయం ఆని అప్పలస్వామి అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page