అనంతగిరి గుట్టమీద కుక్క కాటుకు గురైన బాలుడికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ప్రకటించాలి

TRINETHRAM NEWS

అనంతగిరి గుట్టమీద కుక్క కాటుకు గురైన బాలుడికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ప్రకటించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ శివారెడ్డి పేట లోపల తమ జీవన ఉపాధి అయిన మేకలను కోల్పోయిన రైతన్నలకు 25వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి: రాజేందర్ గౌడ్ బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బి ఆర్ ఎస్ పార్టీ యువజనవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅడ్వకేట్ రాజేందర్ గౌడ్ వికారాబాద్ నియోజకవర్గంలోని శివారెడ్డి పెట్ గ్రామంలో నాయకులు నయీమ్ మరియు కౌన్సిలర్ షరీఫ్ ఆధ్వర్యంలో కుక్కల బెడద వల్ల మేకలను కోల్పోయి ఉపాధి కోల్పోయిన రైతన్నలను పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు బహిరంగంగా గత సంవత్సరం రోజులుగా వికారాబాద్ జిల్లా లోపల ప్రైవేట్ మరియు గవర్నమెంట్ ఆసుపత్రి లలో ఎన్ని కుక్కకాటు కేసులు జరిగినాయో బహిరంగంగా మీడియా ద్వారా పత్రం విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పీకర్ కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించి ఈ దానికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా బాధితులకు 25 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మయ్య సత్యనారాయణ శివశంకర్ నయీమ్ షరీఫ్ నితిన్ యువకులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top