WhatsApp Image 2024 03 20 at 11.46.34
Trinethram News : ప్రేమలో పడ్డ కూతురు.. ఉరేసి చంపిన తల్లి హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. భార్గవి తన ప్రియుడిని ఇంటికి పిలిచి మాట్లాడుతోంది. ఇదే సమయంలో ఇంటికి వచ్చిన జంగమ్మ.. కుమారై తీరును జీర్ణించుకోలేక కోపంతో భార్గవిని కొట్టి, చీరతో ఉరేసినట్లు పోలీసులు తెలిపారు.
