మామను దారుణంగా కొట్టిన కోడలు

TRINETHRAM NEWS

Trinethram News : Mar 12, 2024,

కర్ణాటకలో మామపై దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మంగళూరుకు చెందిన ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి. భర్త విదేశాల్లో ఉండడంతో అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. మార్చి 9న ఆమె మేనమామ పద్మనాభ సువర్ణ (87) తన చొక్కాను సోఫాపై పెట్టడంతో చితకబాదారు. వాకింగ్ స్టిక్ తో దారుణంగా కొట్టారు. బలంగా నెట్టడంతో తల సోఫాకు తగిలి గాయమైంది. ఇదంతా ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

You cannot copy content of this page

Scroll to Top