TRINETHRAM NEWS

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు.

పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు.

కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు.

అయితే ఆమెను ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారనేదానిపై స్పష్టత లేదు.