భద్రతాబలగాలే లక్ష్యంగా.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి!

TRINETHRAM NEWS

Kashmir : భద్రతాబలగాలే లక్ష్యంగా.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి!

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌ (Jammu Kashmir)లో భద్రతాబలగాలే లక్ష్యంగా ఉగ్రదాడి (Terror Attack) జరిగింది. ఇక్కడి పూంఛ్‌ జిల్లాలో జవాన్లను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..

నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఇది రెండో ఉగ్రదాడి కావడం గమనార్హం. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి అదనపు సైనిక బలగాలను పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

You cannot copy content of this page

Scroll to Top