TRINETHRAM NEWS

తెలంగాణ పోటీ లేదు.. బొక్కాలేదు.. పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకోనున్న కేసీఆర్..! పోటీ లేదు.. బొక్కాలేదు.. పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకోనున్న కేసీఆర్..!

ఎంత విచిత్రం.. ప్రత్యేక తెలంగాణ తెచ్చిన పార్టీ రెండుసార్లు వరుసగా సాధారణ ఎన్నికలలో అప్రతిహత విజయం సాధించి తిరుగులేకుండా దూసుకుపోయింది. ప్రత్యేక తెలంగాణ తెచ్చిన పార్టీగా పేరున్న పార్టీ అధినేత.. పదేళ్లపాటు ఇష్టం వచ్చినట్టుగా ఒక మహారాజుగా రాష్ట్రాన్ని ఏలేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న ఆయన ఆశలను రాష్ట్ర ప్రజలు అడియాసలు చేశారు. అయితే మూడు నెలలలోనే అధికారం పోవడంతో.. ఆయన పూర్తి బలహీనుడిగా మారిపోయారు. ఇదంతా ఎవరి గురించో కాదు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి అన్న విషయం అందరికీ తెలిసిందే.

తెలంగాణలో గత డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికలలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
మరో 45 రోజులలో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి పద్దేళ్ళపాటు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ.. అందులోను గత అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 40 సీట్లు గెలుచుకున్న పార్టీ ఎంతో గట్టిగా పోరాటం చేయాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఆ పరిస్థితిలో కనపడటం లేదు. ముందే కేసీఆర్ చేతులు ఎత్తేశారు. లోక్‌శభ ఎన్నికల సన్నాహాలను కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టేసారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది.

ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా వచ్చి పడుతున్న సమస్యలతో పాటు తన ముద్దుల కుమార్తె కవితను ఈడీ అరెస్టు చేయటం కేసీఆర్ ను మరింతగా ఇబ్బంది పెడుతోంది. వరుసగా లీడర్లు కూడా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. కేటీఆర్ ఢిల్లీలో ఉంటున్నారు. దీంతో ఎన్నికలను ఎవరు సీరియస్‌గా తీసుకుంటున్న వాతావరణం కనిపించడం లేదు.
ఇప్పటికే ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారిపోయారు. పలువురు ముఖ్య నేతలు కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్న కూడా.. ఆయన వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదట.

ప్రస్తుతం కెసిఆర్‌కు మేడిగడ్డ కుంగుబాటు అంశంలో విచారణ సవాల్గా మారనుంది. ఈ విషయంలో ఆయన ఎట్టి పరిస్థితిలోనూ చట్టం ముందు దోషుగా నిలబడతారని ఎక్కువమంది నమ్ముతున్నారు. దీనికి తోడు ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుమార్తె కవితను టార్గెట్‌ గా చేసుకుంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వివాదం కూడా ముందుకు వచ్చింది. వీటి నుంచి తప్పించుకోవాలంటే కెసిఆర్‌కు బీజేపీ నుంచి రక్షణ కోరటం తప్ప మరో ఆప్షన్ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు అయ్యేవరకు కేసీఆర్ బహిరంగంగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితి. అందుకే బిఆర్ఎస్ అభ్యర్థులు విషయంలో ఆయన పూర్తిగా బలహీనులను పోటీ చేయిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది.

ఇక బీఆర్ఎస్‌ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఎక్కడా సీరియస్ గా ప్రచారం చేస్తున్న దృశ్యాలు కనిపించడం లేదు. అసలు ఎన్నికలను పూర్తి లైట్గా తీసుకోమని.. కేసీఆర్ యే పరోక్షంగా కేడర్‌కు, పార్టీ నాయకులకు సంకేతాలు పంపుతున్నారన్న అభిప్రాయానికి పార్టీ క్యాడర్ వచ్చేసింది. ఏది ఏమైనా మూడు నెలల కిందట వరకు తిరిగి లేని స్థాయిలో ఉన్న పార్టీకి ఒకే ఒక్క ఓటమితో ఈ పరిస్థితి రావటం జాతీయ రాజకీయ వర్గాల్లోనే సంచలనంగా మారింది.