TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి.

తూత్తుకుడి లేక విరుదునగర్‌ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.

ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించినట్లు తెలిసింది.

తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్‌ కుమార్తె తమిళిసై.

వైద్యవిద్య అభ్యసించారు.

బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో ఆ పార్టీలో చేరారు.